మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి

ABN , First Publish Date - 2020-12-05T09:20:03+05:30 IST

బిడ్డ వైద్యానికి ఆర్థిక పరిస్థితి సహకరించక ఆతల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించి, న్యాయమూర్తికి అర్జీ సమర్పించారు.

మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి

మదనపల్లె కోర్టును  ఆశ్రయించిన తల్లిదండ్రులు


మదనపల్లె క్రైం, డిసెంబరు 4:  బిడ్డ వైద్యానికి ఆర్థిక పరిస్థితి సహకరించక ఆతల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె కోర్టును ఆశ్రయించి, న్యాయమూర్తికి అర్జీ సమర్పించారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లెకు చెందిన చామంచి రామకృష్ణ, గీతాంజలి దంపతులకు ఇద్దరు పిల్లలు నాగలక్ష్మి(7), నాగవరుణ్‌ (5) ఉన్నారు. నాగలక్ష్మి ప్రసవ సమయంలో ఉమ్మనీరు ఎక్కువగా తాగడంతో తల వెనుకభాగంలో శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి మెదడు సక్రమంగా పనిచేయకపోవడంతో మానసిక, శారీరక ఎదుగుదల లోపించింది. ఏడేళ్లుగా బిడ్డకోసం అగచాట్లు పడుతున్న వారు చివరకు తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏడీజేకు అర్జీ సమర్పించారు. 

Updated Date - 2020-12-05T09:20:03+05:30 IST