ఏపీ ఇప్పటి వరకు కంఫర్టబుల్ జోన్‌లోనే ఉంది: డీజీపీ

ABN , First Publish Date - 2020-03-29T00:48:47+05:30 IST

ఏపీ ఇప్పటి వరకు కంఫర్టబుల్ జోన్‌లోనే ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ బెటర్‌గా ఉందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టామని

ఏపీ ఇప్పటి వరకు కంఫర్టబుల్ జోన్‌లోనే ఉంది: డీజీపీ

అమరావతి: ఏపీ ఇప్పటి వరకు కంఫర్టబుల్ జోన్‌లోనే ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ బెటర్‌గా ఉందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారిపై ఎక్కువ నిఘా పెట్టామని, హోం క్వారంటైన్‌ విషయంలో పోలీసుల మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా మంది విదేశాల నుంచి వచ్చి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోనే ఉంటున్నారని, విదేశాల నుంచి వచ్చిన వారు జాగ్రత్తలు పాటించాలని డీజీపీ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన 4500 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజల మంచి కోసం పోలీసులు చెబుతుంటే కొన్ని చోట్ల తిరగబడుతున్నారని, ఈ సమయంలో మంచితనంతో కంట్రోల్ చేయడం కష్టమని డీజీపీ సవాంగ్ చెప్పారు.

Updated Date - 2020-03-29T00:48:47+05:30 IST