ఎండీయూ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2022-07-19T00:53:41+05:30 IST
రేషన్ పంపిణీకి ఎండీయూ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జస్టిస్ భట్టు దేవానంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమరావతి: రేషన్ పంపిణీకి ఎండీయూ వ్యవస్థ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జస్టిస్ భట్టు దేవానంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీకి డీలర్ల వ్యవస్థ ఇప్పటికే ఉండగా ఎండీయు వ్యవస్థ ఎందుకు? అని ప్రశ్నించారు. దేశం మొత్తం ఒకే విధానం ఉంటే ఏపీలో ఎందుకు ప్రత్యేకం?, ఆర్ధిక కష్టాలు ఉన్న రాష్ట్రంలో ఇది అదనపు ఖర్చు కాదా? అని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.