ట్రెజరీ అధికారులకు మరోసారి ఏపీ ప్రభుత్వం హుకుం జారీ

ABN , First Publish Date - 2022-01-31T17:39:48+05:30 IST

ట్రెజరీ అధికారులకు మరోసారి ఏపీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. లాగిన్‌లో ఉన్న వేతన బిల్లులు అన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ట్రెజరీ అధికారులకు మరోసారి ఏపీ ప్రభుత్వం హుకుం జారీ

అమరావతి: ట్రెజరీ అధికారులకు మరోసారి ఏపీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. లాగిన్‌లో ఉన్న వేతన బిల్లులు అన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం లోపు వేతన బిల్లులు అన్నింటినీ ప్రాసెస్ చేయాలని పేర్కొంది. పోలీస్, న్యాయ శాఖల ఉద్యోగుల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు ప్రాసెస్ చేస్తున్నారు. పదవ పీఆర్సీ ప్రకారం కొత్త సాఫ్ట్‌వేర్‌లో బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయలేకపోతున్నామని ఉద్యోగులు తెలిపారు. 25% బిల్లులు మాత్రమే ట్రెజరీకి వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రెజరీల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.


Updated Date - 2022-01-31T17:39:48+05:30 IST