బాలు మృతి పట్ల ఏపీ గవర్నర్ సంతాపం
ABN , First Publish Date - 2020-09-25T20:11:32+05:30 IST
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్..
విజయవాడ: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. నేపథ్య గాయకుడిగా బాలు అభిమానుల ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. అత్యధిక పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ సాధించడం అరుదైన ఘనతని అన్నారు. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు గవర్నర్ హరిచందన్ చెప్పారు.