ఏపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదు: రఘురామ

ABN , First Publish Date - 2021-08-19T21:09:06+05:30 IST

అప్పుల కుప్పతో ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అప్పులు చేయడం కష్టాంగా ఉందని

ఏపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదు: రఘురామ

అమరావతి: అప్పుల కుప్పతో ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. అప్పులు చేయడం కష్టాంగా ఉందని, అభివృద్ధి చేస్తామని, ప్రజలకు చెప్పాలని, ప్రజలు అర్ధం చేసుకుంటారని పేర్కొన్నారు. ఉన్న కంపెనీలను పంపించే విధంగా తమ నేతలు మాట్లాడుతున్నారని, అమర్ రాజా లాంటి కంపెనీలు వెళ్లిపోతుంటే ఇంకా రాష్ట్రానికి ఎవరు వస్తారని రఘురామ ప్రశ్నించారు. నెల్లూరులో వేణుగోపాల స్వామి దేవాలయం కింద 100 ఎకరాల భూమి ఉందని, దాన్ని లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. సజావుగా నడిచే దేవాలయాలను భూములను తీసుకోవడం మంచిది కాదని ఎందుకు ఈ భూదాహం అని రఘురామకృష్ణరాజు నిలదీశారు. దేవుడి సొమ్ముపై కన్ను ఎందుకు? అని ప్రశ్నించారు. పంచు ప్రభాకర్ రెడ్డిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-19T21:09:06+05:30 IST