ధూళిపాళ్ల నరేంద్రపై ఆగని ఏపీ ప్రభుత్వ వేధింపులు

ABN , First Publish Date - 2022-01-09T23:12:24+05:30 IST

సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై ఏపీ ప్రభుత్వ వేధింపులు ఆగలేదు. ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌

ధూళిపాళ్ల నరేంద్రపై ఆగని ఏపీ ప్రభుత్వ వేధింపులు

అమరావతి: సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రపై ఏపీ ప్రభుత్వ వేధింపులు ఆగలేదు. ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్‌ ట్రస్ట్‌కు దేవాదాయశాఖ కమిషనర్‌ నోటీసులిచ్చింది. ట్రస్ట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని సెక్షన్‌ 43 ప్రకారం నోటీసులిచ్చారు. 15 రోజుల్లోగా రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేయాలని కమిషనర్‌ సూచించారు. గతంలో సంగం డెయిరీ, మెమోరియల్‌ ట్రస్ట్‌పై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ట్రస్ట్‌కి ప్రభుత్వ భూములు కేటాయించారంటూ గతంలో నోటీసులిచ్చారు. సంగం డెయిరీపై నమోదైన కేసులకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది.


Updated Date - 2022-01-09T23:12:24+05:30 IST