వంట నూనెల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2022-03-15T23:58:18+05:30 IST

పెరుగుతున్న వంట నూనెల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం

వంట నూనెల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు

అమరావతి: పెరుగుతున్న వంట నూనెల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట నూనెల ధరల నియంత్రణకు ప్రైస్ మానిటరింగ్ యాక్షన్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. మార్కెట్లో నూనె ధరల్లో పెరుగుదల భారీగా ఉంటోందని యాక్షన్ గ్రూప్ పేర్కొంది. ఇప్పుడు ఉన్న నిల్వల ఆధారంగా ధర పెంపు కేవలం అధిక లాభర్జనకేనని పేర్కొంది. కాబట్టి ఏప్రిల్ 10 వరకు ధరలు పెంచేందుకు అవకాశం లేదని యాక్షన్ గ్రూప్ తెలిపింది. అయినా ధరలు పెంచి విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Updated Date - 2022-03-15T23:58:18+05:30 IST