భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ

ABN , First Publish Date - 2021-04-24T23:46:56+05:30 IST

భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది.

భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ

అమరావతి: భారత్ బయోటెక్, సీరం సంస్థలకు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ  రాసింది. రెండు సంస్థలు రూ.4.08 కోట్ల డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిపడా డోసులను ఏపీకి అమ్మాలని భారత్ బయోటెక్, సీరం సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని రెండు సంస్థలను ప్రభుత్వం కోరింది. కేంద్రం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ల బిల్లు త్వరగానే చెల్లిస్తామన్న ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2021-04-24T23:46:56+05:30 IST