కొవిడ్ కారణంగా ఏపీ రెవెన్యూలో రూ.21,933 కోట్ల నష్టం: రావత్

ABN , First Publish Date - 2022-01-19T23:16:50+05:30 IST

కొవిడ్ కారణంగా ఏపీ రెవెన్యూలో 21,933 కోట్ల నష్టం వచ్చిందని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తెలిపారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య నెలకొన్న...

కొవిడ్ కారణంగా ఏపీ రెవెన్యూలో రూ.21,933 కోట్ల నష్టం: రావత్

అమరావతి: కొవిడ్ కారణంగా ఏపీ రెవెన్యూలో రూ.21,933 కోట్ల నష్టం వచ్చిందని ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ తెలిపారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య నెలకొన్న పీఆర్సీ వివాదం, కరోనా నష్టంపై స్పందిస్తూ కొవిడ్ నివారణకు రూ.30 వేల కోట్లు వ్యయం చేశామని ఆయన స్పష్టం చేశారు. 2020-21లో రూ.60,688 కోట్ల పన్నులు వసూలు అయ్యాయని, అందులో రూ.21,933 కోట్ల ఆదాయం కోల్పోయామని రావత్ చెప్పారు.  


ఐఏఎస్‌లకు హెచ్‌ఆర్‌ఏ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్‌ కుమార్‌ తెలిపారు.  పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై 10,247 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఏడాదికి 23% పీఆర్సీ ప్రకారం 70,424 కోట్లు వ్యయం చేయాల్సివస్తుందని శశిభూషన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-19T23:16:50+05:30 IST