ప్రజలు మర్చిపోయినా.. చరిత్ర క్షమించదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-06T00:08:45+05:30 IST

ఏపీ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించిన..

ప్రజలు మర్చిపోయినా.. చరిత్ర క్షమించదు: చంద్రబాబు

విజయవాడ: ఏపీ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన జగన్ ప్రభుతంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో  విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి ఉందన్నారు. అద్భుతంగా టిడ్కో ఇళ్లను కడితే.. అవి ఇవ్వడానికి జగన్‌కు మనసు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాధనం అంతా వైసీపీ ఖజానాకు వెళ్తోందని మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు మర్చిపోయినా.. జగన్‌రెడ్డిని చరిత్ర క్షమించదన్నారు. ప్రజలను పోరాటానికి సిద్ధం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2022-01-06T00:08:45+05:30 IST