ఉద్యోగుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం: బుగ్గన

ABN , First Publish Date - 2021-12-17T04:13:47+05:30 IST

ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా ..

ఉద్యోగుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం: బుగ్గన

అమరావతి: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చలు జరిపామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలతో మాట్లాడామన్నారు. ‘‘చాలా రోజులుగా వారు ఇచ్చిన విజ్ఞప్తులను తీసుకున్నాం. ఈ అంశాల పరిష్కారం కోవిడ్ సహా వివిధ అంశాల వల్ల ఆలస్యం అయ్యాయి. ప్రభుత్వం అనేది ఓ కుటుంబం, ఉద్యోగులు కూడా అందులో భాగం. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇస్తున్నాం. దశల వారిగా వారిచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారి డిమాండ్లను సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుంది. బుధవారం సీఎస్‌తో కూడిన కార్యదర్శుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం తీసుకుంటుంది. నేను స్వయంగా పర్యవేక్షిస్తా. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. వారిని విరమించాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం. వీటిని పరిష్కరిస్తామని వారికి హామీ ఇస్తున్నాం.’’ అని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  తెలిపారు. 


Updated Date - 2021-12-17T04:13:47+05:30 IST