ఏపీ సీఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు: సూర్యనారాయణ

ABN , First Publish Date - 2022-01-19T00:03:11+05:30 IST

ఏపీ సీఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ అన్నారు.

ఏపీ సీఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు: సూర్యనారాయణ

అమరావతి: ఏపీ సీఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సింది సీఎస్సే..అలాంటి సీఎస్ సరిగా వ్యవహరించడం లేదన్నారు.  ఫిట్మెంట్ 23 శాతం అంగీకారం కాదని ఇప్పటికే ప్రభుత్వానికి చెప్పామన్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా పునఃసమీక్ష చేయాల్సిందేనని  చెప్పారు. అధికారులేం చెప్పినా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. పీఆర్సీ జీవోపై పునఃసమీక్షించాల్సిందేనని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-19T00:03:11+05:30 IST