సీపీఎస్‌ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారు: అప్పలరాజు

ABN , First Publish Date - 2021-12-17T22:03:19+05:30 IST

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి ఉద్యమాన్ని మధ్యలోనే

సీపీఎస్‌ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారు: అప్పలరాజు

అమరావతి: ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేసి సీపీఎస్‌ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీపీఎస్ అధ్యక్షుడు ఆర్ అప్పలరాజు అన్నారు. ఉమ్మడి జేఏసీ ఉద్యమం విరమణను వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ హామీలు రాకుండానే ఉద్యమానికి విరామం ప్రకటించారని ఆయన ఆరోపించారు. సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చిందో చెప్పాల్సిన బాధ్యత ఇరు జేఏసీలపై ఉందని ఆయన పేర్కొన్నారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్న మీరు సీపీఎస్‌ ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఉద్యమాన్ని ఆపేశారన్నారు. సీపీఎస్‌పై సజ్జల వ్యాఖ్యలను సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యమం విరమించడం మానుకుని మరోసారి నోటీసు ఇచ్చి సీపీఎస్‌ రద్దు కొరకు పోరాటం చేస్తే అంతా మీ వెంటే నడుస్తామని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-17T22:03:19+05:30 IST