ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా పీఆర్సీ ప్రకటిస్తాం: జగన్
ABN , First Publish Date - 2022-01-07T00:15:30+05:30 IST
ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించిన సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగులు ఆలోచించాలన్నారు. 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని చెప్పారు. ఐఆర్ కోసమే..
అమరావతి: ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై అధికారులతో చర్చించిన సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగులు ఆలోచించాలన్నారు. 2, 3 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని చెప్పారు. ఐఆర్ కోసమే రూ.18 వేల కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ అమలు చేస్తున్నామన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. కొందరు తెలంగాణతో ఏపీని పోల్చుతున్నారని, తెలంగాణ ఆదాయం ఎంత..ఏపీ ఆదాయం ఎంత అని జగన్ ప్రశ్నించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలు అని చెప్పారు. ఏపీ తలసరి ఆదాయం రూ.1.72 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. కాగ్ నివేదిక ప్రకారమే తాను మాట్లాడుతున్నానని జగన్ స్పష్టం చేశారు.