మందడంలో ఉద్రిక్తత...రోడ్డుపై రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-02-19T19:31:10+05:30 IST

మందడంలో ఉద్రిక్తత...రోడ్డుపై రైతుల ధర్నా

మందడంలో ఉద్రిక్తత...రోడ్డుపై రైతుల ధర్నా

అమరావతి: రైతుల ధర్నాతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేదలకు భూములు ఇస్తామంటూ అమరావతి పరిధిలోని మందడం, కృష్ణయాపాలెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. దీంతో రైతులు వారిని అడ్డుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు. తహశీల్దార్, రెవెన్యూ అధికారులను అడ్డుకుని, వారి కార్లను నిలిపివేశారు. పేదలకు భూములు ఇచ్చేందుకు... సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు ఎందుకు వచ్చారని రైతులు ప్రశ్నించారు. కాగా రైతులతో మాట్లాడేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో రైతులకు, రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశ చేసి రైతులకు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. 


Updated Date - 2020-02-19T19:31:10+05:30 IST