LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... బడ్జెట్ను ప్రవేశపెట్టిన బుగ్గన
ABN , First Publish Date - 2022-03-11T15:50:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మొదలవగానే 2022-23 వార్షిక బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. తమిళ కవి తిరువల్లువార్ సూక్తులతో మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కోవిడ్ నుండి ప్రజలను బయట పడేసేందుకు ప్రభుత్వం ప్రజలను అభివృద్ది, శ్రేయస్సు మార్గంలో నడిపిస్తోందన్నారు. నాలుగు మూల స్థంబాల విధానాలను రాష్ట్ర అభివృద్ధికి స్వీకరించామని తెలిపారు. నవరత్నాలు, సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్ధ్యం తెలుస్తుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అటు మండలిలో డిప్యూటీ సిఎం పుష్ఫ శ్రీవాణి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వీక్షించండి.