ప్రత్యేక రైలు.. మొరాయించిన ఏసీలు
ABN , First Publish Date - 2020-10-18T08:55:40+05:30 IST
ప్రత్యేక రైలు.. మొరాయించిన ఏసీలు
గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): దసరా నేపథ్యంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్-విశాఖ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రె్స(రైలు నంబరు 02784) తొలి ట్రిప్లోనే ప్రయాణికులకు నరకం చూపించింది. పలు భోగీల్లో ఏసీలు మొరాయించడంతో ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. శనివారం సికింద్రాబాద్లో రైలు బయలుదేరింది. అప్పటికీ నాలుగైదు భోగీల్లో ఏసీలు ఆన్ కాలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రైల్వేవర్గాలు పట్టించుకోకపోవడంతో పలుమార్లు చైన్ లాగి రైలు నిలిపివేశారు. చివరకు ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని రప్పించి మరమ్మతులు చేయించారు.