దేశం పార్టీ చేసిన మరో అద్భుతం

ABN , First Publish Date - 2020-06-29T22:56:44+05:30 IST

ఎంతైనా తెలుగుదేశం.. తెలుగు దేశమే.. వెలుగు దేశమే..

దేశం పార్టీ చేసిన మరో అద్భుతం

విశాఖ: ఎంతైనా తెలుగుదేశం.. తెలుగు దేశమే.. వెలుగు దేశమే.. భాషలో, భావంలో, సంకల్పంలో, సద్బుద్దిలో ఆ పార్టీ తీరు ఎప్పుడూ జనహితమే కురిపిస్తుంది. ఇందుకు సజీవ సాక్ష్యం ఈ దృశ్యం. లాక్ డౌన్ సమయంలో చిన్నారులు ఎక్కువగా మొబైల్ ఫోన్లకు అడిట్ కావడంతో వారి భవిష్యత్‌ను ఉద్దేశించి టీడీపీ నేత సనపల వరప్రసాద్ వినూత్న రీతిలో ఆలోచించారు. చిన్నారులకు విజ్ఞానాన్ని పెంచేలా పెద్ద బాలశిక్షను ఉచితంగా పంపిణీ చేశారు. 


పెద్దబాలశిక్షను చదివినట్లయితే చిన్నారులకు విజ్ఞానంతోపాటు చాలా అంశాలపై అవగాహన పెరుగుతుందని వరప్రసాద్ తెలిపారు. ఇది వరకు కేవలం 200 పేజీలు మాత్రమే ఉండేదని, ఇప్పుడు తెలుగు సమితివారు దాన్ని అభివృద్ధి చేసి వెయ్యి పేజీల వరకు పెంచడం చాలా శుభపరిణామమని అన్నారు. సుమారు 200 మంది చిన్నారులకు ఉచితంగా పెద్దబాలశిక్ష పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని సనపల వరప్రసాద్ అన్నారు.

Updated Date - 2020-06-29T22:56:44+05:30 IST