ఏఎ్‌ఫఐ ఉపాధ్యక్షురాలిగా అంజూ!

ABN , First Publish Date - 2020-10-22T09:01:33+05:30 IST

భారత మాజీ లాంగ్‌ జంపర్‌ అంజూ బాబీజార్జ్‌ జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ)లో కీలక పదవి దక్కించుకోనుంది. ఆమె ఏఎ్‌ఫఐ ఉపాధ్యక్షురాలిగా...

ఏఎ్‌ఫఐ ఉపాధ్యక్షురాలిగా అంజూ!

అథ్లెటిక్స్‌ చీఫ్‌గా సుమరివాలా హ్యాట్రిక్‌


న్యూఢిల్లీ: భారత మాజీ లాంగ్‌ జంపర్‌ అంజూ బాబీజార్జ్‌ జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ)లో కీలక పదవి దక్కించుకోనుంది. ఆమె ఏఎ్‌ఫఐ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవనుంది. ఈనెల 31న ఏఎ్‌ఫఐ ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. అయితే, అధ్యక్ష పీఠానికి ప్రస్తుత చీఫ్‌ సుమరివాలా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి అంజూ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వరుసగా మూడోసారి ఏఎఫ్‌ఐ అధ్యక్షునిగా సుమరివాలా, తొలిసారి ఉపాధ్యక్షురాలిగా అంజూ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. దీంతో ఇప్పటిదాకా ఏఎ్‌ఫఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న అంజూ ఇక సమాఖ్యలో రెండో అతిపెద్ద పదవిని అలంకరించనుంది. కేరళకు చెందిన 43 ఏళ్ల అంజూ.. 2003 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో పతకం నెగ్గిన ఏకైక భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది.  

Updated Date - 2020-10-22T09:01:33+05:30 IST