ఐపీఎల్ ఈ ఏడాదే జరిగే అవకాశం ఉంది: కుంబ్లే
ABN , First Publish Date - 2020-05-29T03:28:01+05:30 IST
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ పైనే ఐపీఎల్-13 భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబరు లేదంటే నవంబరులో ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు తాజా, మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఈ ఏడాదే జరిగే అవకాశం ఉందంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు హెడ్కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా మాట్లాడుతూ ఐపీఎల్ ఈ ఏడాదే జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందన్నాడు.
మరోవైపు, అక్టోబరులో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘అవును ఐపీఎల్పై ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి’’ అని ఓ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు. అభిమానులు లేకుండా ఆడితే మూడు, నాలుగు వేదికలు సరిపోతాయని అన్నాడు. ఈ విషయంలో తాను ఆశాభావంతో ఉన్నట్టు చెప్పాడు. మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల ప్రయాణాన్ని తగ్గించేందుకు బహుళ స్టేడియాలు ఉన్న నగరాల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు మ్యాచ్లు నిర్వహించవచ్చని అన్నాడు. ఈ ఏడాదే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.