పోలీసుల ప్రశ్నలకు నోరు మెదపని అనిల్, అభిషేక్
ABN , First Publish Date - 2022-04-15T00:01:10+05:30 IST
పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది. పోలీసుల ప్రశ్నలకు నిందితులు అనిల్, అభిషేక్ నోరు మెదపలేదు.
హైదరాబాద్: పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది. పోలీసుల ప్రశ్నలకు నిందితులు అనిల్, అభిషేక్ నోరు మెదపలేదు. ఇద్దరిని దాదాపు 5గంటలుగా పోలీసులు విచారిస్తోన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇద్దరు నిందితులను విడివిడిగా విచారిస్తున్నారు. అనిల్, అభిషేక్ ఇచ్చే వివరాలపై మరికొంతమందికి నోటీసులిచ్చే అవకాశం ఉంది. ఇద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగా పబ్లో సేకరించిన సాంపిల్స్పై పోలీసులు క్లారిటీకి రానున్నారు. గోవా, ముంబైతో ఉన్న లింక్స్, డ్రగ్స్ పెడ్లర్స్పై ఆరా తీస్తున్నారు. అనిల్, అభిషేక్ కాల్డేటా, సీడీఆర్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అనిల్, అభిషేక్ను నలుగురు ఇన్స్పెక్టర్లు విచారిస్తున్నారు.