Tenth Exam Papers: ఏపీలో టెన్త్ పరీక్షలు 6 పేపర్లకు కుదింపు

ABN , First Publish Date - 2022-08-22T22:44:10+05:30 IST

టెన్త్ పరీక్షలు (Tenth Exam) 6 పేపర్లకు కుదిస్తూ ఏపీ సర్కార్ (Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి..

Tenth Exam Papers: ఏపీలో టెన్త్ పరీక్షలు 6 పేపర్లకు కుదింపు

అమరావతి (Amaravati):  టెన్త్ పరీక్షలు (Tenth Exam) 6 పేపర్లకు కుదిస్తూ ఏపీ సర్కార్  (Ap Government) కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి 6 పేపర్ల విధానం అమలుపై జీవో విడుదల చేసింది.  గతంలో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 82ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ గతంలో 11 పేపర్లతో టెన్త్ పరీక్షలు నిర్వహించింది.  కొవిడ్ (Covid) కారణంగా టెన్త్ పరీక్షలు 7 పేపర్లకు కుదిచింది. తాజాగా ఆరు సబ్జెక్టులకు 6 పేపర్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2024-25 విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్సీలో పరీక్షలు రాయాలని జగన్ (Jagan) సర్కార్ నిర్ణయం తీసుకుంది. 


Updated Date - 2022-08-22T22:44:10+05:30 IST