అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విధులు బహిష్కరనే: జుడాలు

ABN , First Publish Date - 2020-08-08T23:15:30+05:30 IST

జూనియర్ డాక్టర్ల సమస్యలపై జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చలు జరిపారు.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విధులు బహిష్కరనే: జుడాలు

విజయవాడ: జూనియర్ డాక్టర్ల సమస్యలపై జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్స్ డిమాండ్స్ పరిష్కారానికి  వైద్యశాఖ అధికారులు మూడు రోజుల సమయం అడిగారు. వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తూనే... విధులలో పాల్గొనాలని జుడాలు నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ 19 పేషెంట్లకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విధులకు హాజరవుతున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నలబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు శాంతియుత మార్గంలోనే ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే విధులను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-08T23:15:30+05:30 IST