అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్లిన వైసీపీ కార్యకర్త..
ABN , First Publish Date - 2022-02-04T18:37:42+05:30 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కావాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు.
అమరావతి/న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కావాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు దాడి చేసిన ఘటనపై కేంద్రహోమంత్రికి ఫిర్యాదు చేసేందుకు సోమిశెట్టి ఢిల్లీకి వెళ్లారు. ‘‘నాకు, నా కుటుంబానికి రక్షణ కలిపించాలంటూ హోమంత్రికి లేఖ రాస్తాను. రాష్ట్రంలో పోలీసులు న్యాయం చేయడం లేదు. బాలినేని పథకం ప్రకారమే నాపై దాడి చేశారు. బాలినేనిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి’’ అని సుబ్బారావు గుప్తా డిమాండ్ చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలిపించాలంటూ నిన్న(గురువారం) జంతర్మంతర్లో సుబ్బారావు నిరసన తెలిపిన విషయం తెలిసిందే.