Apలో బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం

ABN , First Publish Date - 2022-07-31T03:44:54+05:30 IST

ఏపీ (Ap)లో తొలి రోజు బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రాయలసీమ (RayalaSeema), ఉత్తరాంధ్ర జిల్లాల్లోని..

Apలో బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం

అమరావతి (Amaravathi): ఏపీ (Ap)లో తొలి రోజు బార్ల ఈ వేలాలనికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రాయలసీమ (RayalaSeema), ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 323 బార్ల (Bars)కు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో మొత్తం రూ.258 కోట్ల ఆదాయం సమకూరించింది. రాయలసీమ జిల్లాల్లో బార్ల వేలంలో ఎక్కువగా వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.89 కోట్లు వెచ్చించారు. ఆదివారం కోస్తాలోని 6 జిల్లాలో 500 బార్లకు ఈ వేలం నిర్వహించనున్నారు. కోస్తాలో ఎమ్మెల్యేల అనుచరుల దందా ఇప్పటికీ కొనసాగుతోందని తెలుస్తోంది. తమను కాదని బార్లు పాడితే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. 


Updated Date - 2022-07-31T03:44:54+05:30 IST