సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’

ABN , First Publish Date - 2021-03-07T11:57:48+05:30 IST

7హెచ్‌ మీడియా ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’

సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌ : 7హెచ్‌ మీడియా ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీలో శుక్రవారం జరిగిన సూపర్‌ సిక్స్‌ ఆఖరి మ్యాచ్‌లో ‘ఆంధ్రజ్యోతి’ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆంధ్రజ్యోతి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. రమేష్‌ (52), వెంకట్‌ దినేష్‌ (43 నాటౌట్‌) సత్తా చాటారు. ఛేదనలో దిశ మీడియా సంస్థ 71 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. స్పిన్నర్‌ వెంకట్‌ దినేష్‌ 5 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన దినేష్‌కు ఎంఎల్‌ఆర్‌ఐటీ చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును ప్రదానం చేశారు.

Updated Date - 2021-03-07T11:57:48+05:30 IST