Andhra news: మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్పై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-07-20T16:00:19+05:30 IST
మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్ మహాసేనపై కేసు నమోదు అయ్యింది.
శ్రీకాకుళం: మహాసేన మీడియా వ్యవస్థాపకులు రాజేష్ మహాసేనపై కేసు నమోదు అయ్యింది. శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాజేష్పై అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్పై హైదరాబాద్కు చెందిన సన్నీ దీపక్ అనే వ్యక్తితో ఫేస్ బుక్లో తప్పుడు పోస్టులు పెట్టించారన్న రాజేష్పై ఆరోపణలను వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు... రాజేష్ కు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. మరికాసేపట్లో రాజేష్ మహాసేన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు ముందు విచారణకు హాజరుకానున్నారు.