మరోసారి సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
ABN , First Publish Date - 2020-08-08T03:05:46+05:30 IST
ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్నికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.!.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్నికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.!. నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో డిసెంబర్ 31వరకు సాహ్ని సీఎస్గా కొనసాగనున్నారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్కి చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ సేవలను అందించారు. గతేడాది నవంబర్లో ఏపీ సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని జూన్ 30న రిటైరయ్యారు.
అయితే మరో మూడు నెలలు పదవీ కాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ సర్కార్ కోరింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన కేంద్రం సెప్టెంబర్-30 వరకు పదవీ కాలం పొడిగించింది. అయితే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం ఈ పొడిగింపుపై కేంద్రాన్ని రెక్వెస్ట్ చేయగా.. డిసెంబర్-31 వరకు పదవీకాలాన్ని పొడిగించింది. కేంద్ర అనుమతితో సాహ్ని డిసెంబర్ 31వరకు సీఎస్గా కొనసాగనున్నారు.