AP: భార్య మరణం తట్టుకోలేక..భర్త ఆత్మహత్యాయత్నం..

ABN , First Publish Date - 2022-01-26T13:31:54+05:30 IST

యాడికి మండలంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పిన్నెపల్లి గ్రామంలో

AP: భార్య మరణం తట్టుకోలేక..భర్త ఆత్మహత్యాయత్నం..

అనంతపురం: యాడికి మండలంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పిన్నెపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అంగన్ వాడీ టీచర్‎గా విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణి (45) విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. అయితే..భార్య మృతి చెందిన విషయం భర్తకు తెలియడంతో..మనస్థాపానికి గురైన భర్త సుబ్బారెడ్డి భార్య లేని జీవితం నాకు ఎందుకని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో సుబ్బారెడ్డి పరిస్థితి విషమించింది.  బంధువులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-01-26T13:31:54+05:30 IST