దేవుడి సొమ్ముపై కన్ను

ABN , First Publish Date - 2020-07-06T19:55:08+05:30 IST

హాలహర్వి మండలం, అమృతాపురం గ్రామంలో ఆదిలింగేశ్వరస్వామి దేవాలయానికి చెందిన..

దేవుడి సొమ్ముపై కన్ను

కర్నూలు జిల్లా: హాలహర్వి మండలం, అమృతాపురం గ్రామంలో ఆదిలింగేశ్వరస్వామి దేవాలయానికి చెందిన దేవుడి మాన్యం 119 సర్వే నెంబరులో సుమారు 12 ఎకరాల భూమి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ భూమిలో మూడెకరాల 90 సెంట్ల భూమిని సొంత ఊరి వారి ఇళ్ల కోసం మంజూరు చేశారు. మిగిలిని 8 ఎకరాలు ఆ దేవాలయ ధూపదీప నైవేద్యాలు, అర్చకుడి జీవనోపాధికోసం ఖర్చుపెడుతున్నారు. కానీ మరో 4 ఎకరాల దేవుడి భూమిని ప్రభుత్వం తీసుకుందని, ఈ భూమిని వేరే గ్రామస్తులకు ఇచ్చామని చెబుతూ.. ఆ ప్రకారం పట్టాలు పంపిణీ చేయడానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. దీంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అధికారులు మాత్రం పట్టాల పంపిణీ చేపట్టి తీరుతామని ముందడుగు వేయడంతో గ్రామస్తులు వారి తీరుపై మండిపడుతున్నారు.

Updated Date - 2020-07-06T19:55:08+05:30 IST