అమరావతి రైతులకు త్వరలో వార్షిక కౌళ్లు?

ABN , First Publish Date - 2020-05-31T09:24:00+05:30 IST

రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు మొత్తాలు కొన్ని రోజుల్లోనే వారి బ్యాంకుఖాతాల్లో జమ కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సుమారు రూ.190 కోట్లను ఇప్పటికే రాష్ట్ర

అమరావతి రైతులకు త్వరలో వార్షిక కౌళ్లు?

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు మొత్తాలు కొన్ని రోజుల్లోనే వారి బ్యాంకుఖాతాల్లో జమ కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సుమారు రూ.190 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, అవసరమైన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, కౌళ్ల మొత్తాలను రైతులకు జమ చేసేందుకు సీఆర్డీయే కసరత్తు చేస్తోంది. దాదాపు 10-15 రోజుల్లో ఇదంతా పూర్తయి, రైతుల ఖాతాల్లో ఆ మొత్తాలను వేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-31T09:24:00+05:30 IST