రాజధాని రైతుల దీక్షలకు కోదండరాం సంఘీభావం
ABN , First Publish Date - 2020-02-17T00:22:22+05:30 IST
అమరావతి రైతులకు తెలంగాణ నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన నేతలు రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు.
అమరావతి: అమరావతి రైతులకు తెలంగాణ నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన నేతలు రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. రాజధాని రైతుల దీక్షలకు టీజేఎస్ అధినేత కోదండరాం సంఘీభావం ప్రకటించారు. మల్కాపురంలో రాజధాని రైతులను ఆయన కలిశారు. తమ సమస్యలను కోదండరాంకు రైతులు వివరించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించాలని కోదండరాం చెప్పారు.
మరోవైపు హైదరాబాద్లో అమరావతి రైతులకు మద్దతుగా కూకట్పల్లిలో సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని పోలీసులు అడ్డుకుని టెంట్లు తొలగించారు. అంతేకాదు అమరావతి జేఏసీ నేత శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. శీనివాస్ అరెస్ట్ కావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.