సుప్రీం కోర్టులో అమరావతి భూముల కేసు.. ఏప్రిల్ 7కి వాయిదా
ABN , First Publish Date - 2021-03-05T20:35:40+05:30 IST
అమరావతి భూములపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది.
ఢిల్లీ: అమరావతి భూములపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. కేసును ఏప్రిల్ 7కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ప్రతివాదుల అఫిడవిట్లోని అంశాలపై తమ అభిప్రాయాన్ని ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ తెలియజేశారు. విచారణ పేరుతో బలవంతపు చర్యలు ఉండవని, కోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదన్నారు. సీబీఐ లాంటి విచారణ సంస్థ దర్యాప్తు చేసేందుకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని అంశాలను తదుపర విచారణ సమయంలో పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.