అమరావతి రైతు దీక్షకు జనసేన మద్దుతు
ABN , First Publish Date - 2022-02-25T14:40:34+05:30 IST
రాజధాని కోసం రైతులు చేపట్టిన దీక్షకు జనసేన మద్దుతు ప్రకటించింది.
అమరావతి: రాజధాని కోసం రైతులు చేపట్టిన దీక్షకు జనసేన మద్దుతు ప్రకటించింది. దీక్ష చేస్తున్న రైతులకు జనసేన నేత పి.మహేష్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... అమరావతికి ముందు నుండి జనసేన మద్దతు ఉందన్నారు. మహా పాదయాత్రను ఒక్కరు కూడా అడ్డుకోలేదు అంటే ప్రజల అభిమతం ఎంటో అర్థం అవుతుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ అమరావతి రైతుల చేతుల్లో ఉందన్నారు. రాష్ట్రం పెద్ద ఎత్తున సంక్షోభంలో పడిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో అమరావతి రైతులు ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దీక్ష విరమణ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ నరేంద్ర, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మరెడ్డి శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ పాల్గొన్నారు.