Amaravatiలో రూ.192 కోట్లతో పనులు
ABN , First Publish Date - 2022-07-05T01:01:13+05:30 IST
హైకోర్టు తీర్పుకు కట్టుబడి రాజధాని అమరావతి (Amaravati)లో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని సీఆర్డీఏ (CRDA) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు.
తుళ్లూరు: హైకోర్టు తీర్పుకు కట్టుబడి రాజధాని అమరావతి (Amaravati)లో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని సీఆర్డీఏ (CRDA) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సోమవారం రాజధాని గ్రామం దొండపాడు పరిధిలోని పిచుకలపాలెం రెవెన్యూలో రూ.192.52 కోట్లతో జోన్-4 అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ జోన్లో 63 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు, ఐఏఎస్, ఐపీఎస్ల భవనాల తుది దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 12 జోన్లలోని ఎల్పీఎస్ లే అవుట్లలోని రైతుల ప్ల్లాట్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పనులు చేసుకుపోతామని తెలిపారు. భూమిలేని నిరుపేదలకు పింఛన్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఇవ్వాల్సి ఉందన్నారు. తొలుత మార్చినెల పింఛన్ విడుదల చేస్తామన్నారు. కొన్ని కోర్టులో పరిధిలో, మరికొన్ని టైటిల్స్ విషయం తేలాల్సి ఉన్నందున అసైన్డ్ రైతులకు కౌళ్లు జమ కాలేదన్నారు. సమస్యలు లేనివారికి కౌలు అందజేశామని చెప్పారు. కమిషనర్ కాళ్లు పట్టుకునేందుకు యత్నించి అసైన్డ్ రైతు పులి చిన్నా తనకు కౌలు రావడం లేదని వివేక్ తెలిపారు.