అమరావతి ప్రాంతంలో మరో అలజడికి తెర లేపిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-05T17:41:17+05:30 IST

విజయవాడ: అమరావతి ప్రాంతంలో మరో అలజడికి ప్రభుత్వం తెర లేపింది

అమరావతి ప్రాంతంలో మరో అలజడికి తెర లేపిన ప్రభుత్వం

విజయవాడ: అమరావతి ప్రాంతంలో మరో అలజడికి ప్రభుత్వం తెర లేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని అభిప్రాయపడుతున్నారు.


అమరావతి క్యాపిటల్ సిటీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. మంగళగిరి మండలం కుర్రగల్లు పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. కుర్రగల్లు సభ తర్వాత నీరుకొండ గ్రామంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు. తమ గ్రామంలో సభ ఏర్పాటుపై కుర్రగల్లు గ్రామ రైతులు నిరసన తెలుపుతున్నారు.

Updated Date - 2022-01-05T17:41:17+05:30 IST