అమరావతి నుంచి ఒక్కొక్కటిగా వెళ్తున్న కార్యాలయాలు
ABN , First Publish Date - 2021-12-07T17:09:47+05:30 IST
మూడు రాజధానుల చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ విషయాన్ని హైకోర్టుకు కూడా తెలిపింది. కానీ..
అమరావతి: మూడు రాజధానుల చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ విషయాన్ని హైకోర్టుకు కూడా తెలిపింది. కానీ రాజధానిపై అందరి అనుమానాలు నిజం చేస్తూ.. తాము చేయాలనుకున్నపని చేస్తునే ఉన్నారు. అమరావతిలోని సంస్థలను ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు. తాజాగా వక్ఫ్ ట్రైబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కర్నూలుకు లోకాయుక్త, హెచ్చార్సీ సంస్థలను తరలించిన జగన్ ప్రభుత్వం... తాజాగా వక్ఫ్ ట్రైబ్యునల్ ఆఫీసు తరలింపుపై ఆదేశాలిచ్చింది.