కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ నేతలు జోలి యాత్ర చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోంది. శారదానగర్ నుంచి కోనేరు సెంటర్ వరకు యాత్ర చేస్తూ నిధుల సమీకరిస్తున్నారు. యాత్రకు మద్దతు తెలుపుతూ స్థానికులు విరాళాలు ఇస్తున్నారు.