242కు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు
ABN , First Publish Date - 2020-08-15T15:30:04+05:30 IST
రాజధాని కోసం రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనలు 242వ రోజుకు చేరుకున్నాయి.
అమరావతి: రాజధాని కోసం రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనలు 242వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, దొండపాడు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు, మహిళలు జాతీయ జెండాలు ఎగురవేయనున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.