LIVE: ఏపీలో జడ్జి నోట బూతు పంచాంగం

ABN , First Publish Date - 2020-08-07T13:18:45+05:30 IST

LIVE: ఏపీలో జడ్జి నోట బూతు పంచాంగం

LIVE: ఏపీలో జడ్జి నోట బూతు పంచాంగం

అమరావతి: ఏపీలో ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకుల బూతు పంచాంగం వింటూ ఉన్నాం. అధికార పార్టీ నాయకులు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులపైన అలాగే న్యాయవ్యవస్థపైన, న్యాయమూర్తులపైన బూతుల దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మాజీ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య కూడా బూతుల పంచాంగం విప్పిన వాతావరణ చూస్తున్నాం. జస్టిస్‌గా పనిచేసిన వ్యక్తి కూడా ఈ తరహాగా బూతులు మాట్లాడటం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది. ఏపీలో వైసీపీ నాయకుల బూతు పంచాంగానికి ఇంటర్నల్‌గా జస్టిస్‌గా పనిచేసిన వారు మాట్లాడుతున్న బాష కూడా అదే తరహా ఉండటంతో...అధికార పార్టీ దారిలోనే వీరంతా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఏదైనా సమస్య వస్తే హైకోర్టులో న్యాయం జరుగుతుంది అని ప్రజలు భావించి న్యాయస్థానికి వెళ్లే పరిస్థితి ఉంటుంది.


ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎలా బెదిరించవచ్చు, న్యాయవ్యవస్థను ఎలా బ్లాక్‌మెయిల్ చేయవచ్చు...ఈ తరహా మాటలన్నీ కూడా ఒక రిటైర్డ్ జడ్జి నుంచి రావడం షాక్‌కు గురిచేసింది. జస్టిస్ ఈశ్వరయ్య అధికార పార్టీకి సంబంధించిన నాయకుడిలా మాట్లాడారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన రామకృష్ణ జడ్డికి వ్యవహారానికి సంబంధించి... ఈశ్వరయ్యకు సంబంధించిన ఆడియో వైరల్ అయ్యింది. ఆ ఆడియో ఆయనదే అంటూ బెంగళూరుకు చెందిన ట్రూత్‌ ల్యాబ్‌ కూడా నిర్ధారించిన నేపథ్యంలో ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్‌ ఇష్యూలో చర్చ నిర్వహించారు. ఈ చర్చలో మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ నేత జంగా గౌతమ్, బీజేపీ నేత ఆర్డీ విల్సన్, జడ్జి రామకృష్ణ, టీడీపీ నేత చెంగలరాయుడు పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated Date - 2020-08-07T13:18:45+05:30 IST