ఏపీ జూడో బృందాలను అనుమతించండి
ABN , First Publish Date - 2022-09-23T10:50:52+05:30 IST
ఏపీ జూడో బృందాలను అనుమతించండి
గుజరాత్ క్రీడలశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఏపీ జూడో అసోసియేషన్తో కలిసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) ఎండీ, వైస్ చైర్మన్ పంపించే జూడో బృందాలను ఈ నెల 29 నుంచి గుజరాత్లో జరిగే జాతీయ క్రీడలకు అనుమతించాలని గుజరాత్ క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. జాతీయ క్రీడలకు పంపే జూడో బృందాల విషయంలో ఏపీవోఏ సెక్రెటరీ జనరల్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.