హజ్ యాత్ర దరఖాస్తులన్నీ క్యాన్సిల్: భారత హజ్ కమిటీ

ABN , First Publish Date - 2021-06-16T05:22:00+05:30 IST

భారతదేశం నుంచి హజ్ యాత్రకు వెళ్లడం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులన్నింటినీ తిరస్కరించినట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

హజ్ యాత్ర దరఖాస్తులన్నీ క్యాన్సిల్: భారత హజ్ కమిటీ

న్యూఢిల్లీ: భారతదేశం నుంచి హజ్ యాత్రకు వెళ్లడం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులన్నింటినీ తిరస్కరించినట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. 2021కి గానూ హజ్ యాత్ర కోసం సౌదీ వెళ్లాలని చేసుకున్న దరఖాస్తులన్నీ క్యాన్సిల్ అయినట్లు ఈ కమిటీ వెల్లడించింది. కరోనా ప్యాండెమిక్ కారణంగా సౌదీలో ఉన్న కొంతమందికి మాత్రమే హజ్‌కు వెళ్లే అవకాశం లభించనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత హజ్ కమిటీ మంగళవారం వెల్లడించింది. ఏటా జరిగే హజ్ యాత్రలు ఇలా రద్దవడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది కూడా కరోనా కారణంగా హజ్ యాత్రకు బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-06-16T05:22:00+05:30 IST