ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను సస్సెండ్ చేసిన దుబాయి

ABN , First Publish Date - 2020-09-18T10:14:34+05:30 IST

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను దుబాయి ప్రభుత్వం 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్న

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను సస్సెండ్ చేసిన దుబాయి

దుబాయి: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను దుబాయి ప్రభుత్వం 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానప్పటికి.. శుక్రవారం నడవాల్సిన విమానాలు పూర్తిగా రద్దు అయినట్టు దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చూపిస్తోంది. తాజా ఆదేశాలతో దుబాయి ఎయిర్‌పోర్టుకు కాని.. దుబాయి ఎయిర్‌పోర్టు నుంచి బయటి దేశానికి కాని ఈ విమానాలు నడవడంపై నిషేధం కొనసాగుతుంది. గురువారం రాత్రి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి. కొవిడ్-19 కారణాల వల్లే దుబాయి ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను 15 రోజుల పాటు సస్పెండ్ చేసిందని చెబుతున్నారు. ఇక ఇప్పటికే తమ సర్వీస్‌ షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రీషెడ్యూల్ అయినట్టుగా మెసేజ్‌లు వచ్చినట్టు ప్యాసెంజర్లు చెబుతున్నారు. కాగా.. వందే భారత్ మిషన్‌లో భాగంగా యూఏఈలో చిక్కుకున్న భారతీయులు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ద్వారా స్వదేశానికి చేరుతున్నారు. 

Updated Date - 2020-09-18T10:14:34+05:30 IST