అది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే: ఆలపాటి రాజా
ABN , First Publish Date - 2020-08-06T20:03:28+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో..
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ప్రజలను బాధిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. బిల్లులు ఆమోదించిన తీరు ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. చంద్రబాబు సవాల్కు స్పందనే లేదని, దమ్ము, ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని ఆలపాటి రాజా అన్నారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు చేస్తున్నారని, ప్రశ్నించినవారిపై కేసులు పెట్టి, జైల్లో పెడుతున్నారని ఆలపాటి రాజా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రజల మనిషని, ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని అన్నారు. ప్రజా సమస్యపై పోరాటం చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని మరోసారి ఆలపాటి రాజా సవాల్ చేశారు.