బెయిల్‌పై అఖిలప్రియ విడుదల

ABN , First Publish Date - 2021-01-24T09:06:01+05:30 IST

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం సాయంత్రం విడుదలయ్యారు. సికింద్రాబాద్‌ కోర్టు శుక్రవారం ఆమెకు షరతులతో కూడిన

బెయిల్‌పై అఖిలప్రియ విడుదల

జైలు వద్ద అభిమానుల కోలాహలం

చంద్రబాబు ఫోన్‌.. ధైర్యంగా ఉండాలని సూచన


సైదాబాద్‌/అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం సాయంత్రం విడుదలయ్యారు. సికింద్రాబాద్‌ కోర్టు శుక్రవారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ పత్రాలు జైలు అధికారులకు చేరడం ఆలస్యమవడంతో.. ఆమె శుక్రవారం విడుదల కాలేకపోయారు. ఆ లాంఛనాలు పూర్తికావడంతో శనివారం ఉదయం ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాలకు చెందిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జైలు బయట గుమికూడారు. ఇంకోవైపు.. అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి ఫోన్‌ చేశారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా.. మనోనిబ్బరంతో ముందుకు సాగాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి’ అని సూచించారు.

Updated Date - 2021-01-24T09:06:01+05:30 IST