ఎయిరిండియా... ఈ వారాంతంలో ‘టాటా’కు..!
ABN , First Publish Date - 2022-01-24T22:43:21+05:30 IST
భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... ఈ వారాంతంలో టాటాల చేతుల్లోకి వెళ్ళే అవకాశాలున్నాయి. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు సూచనప్రాయంగా వివరాలను పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... ఈ వారాంతంలో టాటాల చేతుల్లోకి వెళ్ళే అవకాశాలున్నాయి. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు సూచనప్రాయంగా వివరాలను పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియ నేపధ్యంలో... కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు 8 న ఎయిరిండియాను... టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీకి చెందిన టాలేస్ పన్రూవేట్ లిమిటెడ్కు... రూ. 8 వేల కోట్లకు విక్రయించిన విషయం తెలిసిందే. కాగా... ఈ డీల్కు సంబంధించిన మరికొన్ని అంకాలు... త్వరలోనే పూర్తికానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా... టాటా గ్రూపునకు... ఎయిరిండియా ఎక్స్ప్రెస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆర్మ్ ఎయిరిండియా స్లాట్లలో కూడా 50 శాతం వాటాను అప్పగించనున్నారు. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సార్ధ్యంలోని కన్సార్షియం రూ. 15,100 కోట్ల ఆఫర్ను... టాటా గ్రూపు అక్టోబరు 8 న అధిగమించింది. కాగా... 2003-04 తర్ావత... ఇది తొలి ప్రైవేటీకరణ ప్రక్రియ కాగా, టటా స్టేబుల్లో మూడవ ఎయిర్లైన్ బ్రాండ్ కానుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్తో జాయింట్ వెంచర్గా ఉన్న ఎయిర్ ఏషియా ఇండియా, విస్టాల్లో టాటా గ్రూపు మెజారిటీ వాటాలను కలిగి ఉన్న విషయం తెలిసిందే.