లండన్‌కు ప్రత్యేక విమానాల్ని న‌డ‌ప‌నున్న ఎయిరిండియా.. కార‌ణ‌మిదే

ABN , First Publish Date - 2020-04-03T13:47:12+05:30 IST

కరోనా కారణంగా భారత్‌లో ఆగిపోవాల్సి వచ్చిన బ్రిటన్‌ వాసుల్ని వారి స్వదేశానికి తరలించేందుకు లండన్‌కు ప్రత్యేక విమానాల్ని నడపాలని ఎయిర్‌ ఇండియా (ఏఐ) నిర్ణయించింది.

లండన్‌కు ప్రత్యేక విమానాల్ని న‌డ‌ప‌నున్న ఎయిరిండియా.. కార‌ణ‌మిదే

న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్‌లో ఆగిపోవాల్సి వచ్చిన బ్రిటన్‌ వాసుల్ని వారి స్వదేశానికి తరలించేందుకు లండన్‌కు ప్రత్యేక విమానాల్ని నడపాలని ఎయిర్‌ ఇండియా (ఏఐ) నిర్ణయించింది. ఈ శనివారం నుంచి ఏడో తేదీ వరకూ నాలుగుసార్లు విమానాలు తిరగనున్నట్లు ప్రకటించింది. అయితే.. అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకురావడం లేదని.. తిరుగుప్రయాణంలో విమానాలు ఖాళీగా వస్తాయని ఏఐ తెలిపింది.

Updated Date - 2020-04-03T13:47:12+05:30 IST