అమ్మకానికి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ టికెట్లు.. భారత ఎంబసీ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-07-04T17:42:35+05:30 IST
దుబాయిలోని భారత ఎంబసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 9 నుంచి 14 వరకు షార్జా నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు రానున్న తొమ్మిది ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన టిక్కెట్లను అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించింది.
యూఏఈ: దుబాయిలోని భారత ఎంబసీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 9 నుంచి 14 వరకు షార్జా నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు రానున్న తొమ్మిది ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన టిక్కెట్లను అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబసీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. "భారత పౌరులు ఎవరైతే అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రిపాట్రియేషన్ కోసం తమ పేరును నమోదు చేసుకున్నారో వారు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుకింగ్ కార్యాలయాల వద్ద లేదా www.airindiaexpress.in వెబ్సైట్లో లేదా యూఏఈలోని అథారైజ్డ్ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు" అని ఎంబసీ ట్వీట్ చేసింది.
అయితే, టికెట్ బుకింగ్ సమయంలో పాస్పోర్ట్ సమాచారం తప్పనిసరి అని సూచించింది. ఈ నెల 9 నుంచి 14 వరకు షార్జా నుంచి తమిళనాడులోని మదురై, కోయంబత్తూర్, తిరుచిరప్పల్లి... కేరళలోని తిరువనంతపురం, కొచ్చి మరియు హైదరాబాద్కు ఈ తొమ్మిది విమాన సర్వీసులు రానున్నాయి.
విమాన సర్వీసుల వివరాలు
జూలై 9న: మధ్యాహ్నం 2 గంటలకు షార్జా-మదురై
జూలై 9న: ఉదయం 10.30 గంటలకు షార్జా-కోయంబత్తూర్
జూలై 10న: రాత్రి 8 గంటలకు షార్జా-తిరువనంతపురం
జూలై 10న: మధ్యాహ్నం 2 గంటలకు షార్జా- తిరుచిరప్పల్లి
జూలై 11న: ఉదయం 8 గంటలకు షార్జా-కొచ్చి
జూలై 11న: మధ్యాహ్నం 2 గంటలకు షార్జా-హైదరాబాద్
జూలై 12న: మధ్యాహ్నం 2 గంటలకు షార్జా-కోయంబత్తూర్
జూలై 13న: ఉదయం 10.30 గంటలకు షార్జా-హైదరాబాద్
జూలై 14న: మధ్యాహ్నం 2 గంటలకు షార్జా-తిరువనంతపురం