UAE flights: భారత్కు ఎయిర్ అరేబియా మరో కొత్త సర్వీస్
ABN , First Publish Date - 2022-04-08T13:48:58+05:30 IST
యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది.
అబుదాబి: యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్లోని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్కు ఈ కొత్త సర్వీస్ను నడపనుంది. ఈ ఏడాది మే 5వ తేదీ నుంచి ఈ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా ప్రకటించింది. ఈ మేరకు గురువారం విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైనా, ఎన్నో అద్భుత కట్టడాలతో వారసత్వ సంపదకు నెలవుగా ఉన్న పింక్ సిటీ జైపూర్కు కొత్త సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని తన ప్రకటనలో పేర్కొంది. కాగా, జూలై 2020లో అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్యారియర్ సర్వీస్ ప్రారంభించినప్పటి నుండి ఇది ఎయిర్ అరేబియాకు 18వ రూట్గా తెలిపింది. కస్టమర్లు ఈ సర్వీసుకు సంబంధించిన విమాన టికెట్ల కోసం ఎయిర్ అరేబియా అధికారి వెబ్సైట్ లేదా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.